తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-08 04:53 GMT

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయనుంది. జనవరి 9 వ తేదీకి సంబంధించిన ఎస్.ఎస్.డి. టోకెన్లు మధ్యాహ్నం నుంచి ఇవ్వనున్నారు. గతంలో మాదిరిగానే ఈరోజు కారోజు టోకెన్లు ఇచ్చి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.


టోకెన్లు ఇచ్చే ప్రాంతాలివే

శ్రీనివాసం - ఆర్టీసీ బస్టాండ్ దగ్గర
విష్ణు నివాసం - రైల్వే స్టేషన్ ఎదురుగా
భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర

శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు "అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్" లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి.


Tags:    

Similar News