Tirumala : శనివారం ఇక తిరుమలలో రష్ చూశారా?

నేడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు

Update: 2024-04-27 02:59 GMT

Tirumala

నేడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కూడా గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

18 గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించని భక్తులకు స్వామి వారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,909 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,403 మంది మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News