మోటారు సైకిళ్ళపై అనుమానాస్పదంగా తిరుగుతూ.. విచారించగా?

తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు

Update: 2023-08-28 04:33 GMT

తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 43ఎర్రచందనం దుంగలు, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్సు డి.ఎస్.పి. చెంచుబాబు కథనం ప్రకారం.. రైల్వే కోడూరు ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐ అలీభాషా సత్యవేడు సమీపంలోని నాగలాపురం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో కొందరు బీరకుప్పం ప్రాంతంలో మోటారు సైకిళ్లతో అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము ఎర్రచందనం స్మగ్లర్లమని స్పష్టం చేశారు. వీరి వద్ద 43ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు అంగీకరించారు. ఆ తర్వాత ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలు 664 కేజీలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటాయని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు.

తమిళనాడు నుండి వచ్చి ఎర్రచందనం స్మగ్లింగ్ లో భాగమయ్యారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూడి తాలూకాకు చెందిన సభాపతి ధర్మన్ (45), తిరుపతి జిల్లా తొండవాడకు చెందిన ఐ.రవి(32), తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన ఎన్.కోదండపాణి (46), సత్యవేడు మండలానికి చెందిన ఎం. నరసింహులు (50), తిరుపతి అవిలాలకు చెందిన బి.రమేష్ (42), నాగలాపురం బీరకుప్పంకు చెందిన ఏ రమేష్ (34), ఏ.మారయ్య (65)లుగా గుర్తించారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేసి ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News