Tirumala : శనివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ?

తిరుమలలో నేడు రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది

Update: 2024-04-06 02:05 GMT

Tirumala

తిరుమలలో నేడు రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూలర్లను క్యూ లైన్లలో ఏర్పాటు చేశారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

కంపార్ట్‌మెంట్లలోని...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,351 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News