Tirumala : శుక్రవారమయినా.. భక్తులు అంతంత మాత్రమే

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శుక్రవారం సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

Update: 2024-05-10 04:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. శుక్రవారం సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగానే భక్తుల రద్దీ కొంత తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీకెండ్ లో మళ్ల ీరద్దీ పెరుగుతుందని చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లోగా పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

పది కంపార్ట్‌మెంట్లలో...
నిన్న తిరుమల శ్రీవారిని 65,508 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,996 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
.


Tags:    

Similar News