నేడు వ్యాపార వర్గాలతో లోకేష్ సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు వ్యాపారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Update: 2022-08-17 03:00 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు వ్యాపారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వర్తకులు, చిరు వ్యాపారులతో లోకేష్ చర్చించనున్నారు. విజయవాడలో ఎ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సమస్యలపై...
ఈ ప్రభుత్వంలో వర్తక, వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నారా లోకేష్ వారితో చర్చిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కరపత్రాన్ని లోకేష్ విడుదల చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్తక, వ్యాపార వర్గాలకు జరుగుతున్న నష్టంపై అందులో వివరించనున్నారు.


Tags:    

Similar News