నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ పర్యటన

నేడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించనున్నారు

Update: 2024-02-21 03:20 GMT

నేడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించారు. ఈ బృందం పర్యటించి నివేదిక ఇవ్వనుంది.

నివేదిక ఇచ్చిన తర్వాత...
గుంటూరు జిల్లా డయేరియా వ్యాప్తి చెందడంతపై క్షేత్రస్థాయిలో నిజ నిర్థారణకు నియమించిన ప్రత్యేక బృందం నేడు పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సభ్యులుగా నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, మహమ్మద్ నసీర్ లు ఉన్నారు. వాస్తవ పరిస్థితులపై పార్టీకి నివేదికను కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు.


Tags:    

Similar News