Chandrababu : మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు

Update: 2023-12-13 11:43 GMT

chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఈ ఏడాది సెప్టంబరు 9న అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

పార్టీ నేతలతో...
తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు యువగళం ముగింపు సభపై కూడా ఆయన చర్చించనున్నారు.


Tags:    

Similar News