వాలంటీర్లపై మా నిర్ణయం ఇదే : అచ్చెన్నాయుడు

వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు

Update: 2024-03-26 07:14 GMT

వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారురు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమేనని అచ్చెన్నాయుడు తెలిపారు.

వారిని సమర్థించం...
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని, ఇదే తెలుగుదేశం పార్టీ వైఖరి అని అచ్చెన్న తెలిపారు.. ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైకాపా చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.


Tags:    

Similar News