ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోండి : అచ్చెన్నాయుడు

ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఫిర్యాదు చేశారు.

Update: 2024-03-26 13:37 GMT

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్ఎంఎస్ ను ముఖ్యమంత్రి కార్యాలయం తమ ఆదీనంలోకి తీసుకుందని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిధులు దారి మళ్లిస్తున్నారని...
సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్‌లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని ఆయన అందులో తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తక్షణమే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశార.


Tags:    

Similar News