మోదీని ప్రశంసించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

Update: 2022-08-15 07:45 GMT

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు అనేక మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. ఆస్తులను త్యాగం చేశారని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అందరం కృషి చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

ఆర్థిక అసమానతలను...
ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గతంలో పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలిచేందుకు దోహదపమిందన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో అంశాలలో ముందున్నారని ప్రశంసించారు. పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడిన ఎన్టీఆర్ ను స్మరించుకోవాలని ఆయన అన్నారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో ముందుకు వెళుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


Tags:    

Similar News