స్పీకర్ కు చంద్రబాబు రిప్లై... వారిపై చర్యలు తీసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ అధినేత చంద్రబాబు రిప్లై ఇచ్చారు

Update: 2024-01-25 11:55 GMT

appolitics

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ అధినేత చంద్రబాబు రిప్లై ఇచ్చారు. తమ పార్టీ నుంచి ఎన్నికై అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై చంద్రబాబు నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వివరణ కోరగా ఆయన ఈ మేరకు రిప్లై ఇచ్చారు. పార్టీ విప్ డోలా బాలాంజనేయ స్వామి ఇచ్చిన పిటీషన్ పై స్పీకర్ చంద్రబాబు వివరణ కోరగా ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు.

ఆ నలుగురిపై...
వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లపై అనర్హత వేటు వేయాలని చంద్రబాబు కోరారు. తాము పార్టీ నిర్ణయం మేరకే వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కార్యాలయానికి కోరినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పీకర్ కు రాసిన లేఖలో కోరారు.


Tags:    

Similar News