కర్నూలు మెడికల్ కళాశాలలో కొనసాగుతున్న కరోనా

కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. వైద్య సిబ్బంది కి పాజిటివ్ వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది.

Update: 2022-01-12 02:19 GMT

కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. వైద్య సిబ్బంది కి పాజిటివ్ వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ కర్నూలు మెడికల్ కళశాలలో 22 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులే కావడం విశేషం. వీరందరికీ ఆసుపత్రిలోని ప్రత్యేక బ్లాక్ లో ఉంచి చికిత్స ను అందిస్తున్నారు.

మరో ఏడుగురికి....
ఇదిలా ఉండగా కర్నూలు మెడికల్ కళాశాలలో తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. మొత్తం 29 మందికి కరోనా సోకింది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ఈ నెల 17వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. వైద్య విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపల్ ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News