మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయ్

తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పెగాసస్ర్ రె ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు

Update: 2022-03-18 13:04 GMT

తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పెగాసస్ స్పై వేర్ తమ ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. తమ పార్టీపై దుష్ప్రచారం చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని చెప్పారు. గత కొంతకాలంగా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సోమిరెడ్డి చెప్పారు.

తమను నిలువరించేందుకు...
ిివిపక్షాలను నిలువరించేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. తాము దీనిపై ఉన్నతస్థాయి విచారణను కోరుతున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News