రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈరోజు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వస్తున్నారు.

Update: 2023-05-05 06:19 GMT

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వస్తున్నారు. ములాఖత్ లో జైలులో ఉన్న ఆదిరెడ్డి వాసు, అప్పారావును పరామర్శించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

పరామర్శకు...
ఆదిరెడ్డి అప్పారావు, వాసులను చిట్‌ఫండ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరూ సెంట్రల్‌లో జైలులో ఉండటంతో రాజమండ్రి పర్యటనకు వచ్చిన చంద్రబాబు పరామర్శించేందుకు వస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడకు టీడీపీ నేతలు పెద్దయెత్తున చేరకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.


Tags:    

Similar News