Tirumala : నేడు రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2023-11-06 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేకపోయినా క్యూ లైన్‌లో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్నటి వరకూ తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. శనివారం, ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,466 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News