బిగ్ బ్రేకింగ్‌ : 100 అడుగుల లోయ‌లో ప‌డిన బ‌స్సు.. లోప‌ల 50 మందికి పైగా ప్రయాణికులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2023-08-20 10:44 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుత‌ప్పిన‌ ఆర్టీసీ బస్సు సుమారు 100 అడుగుల‌ లోయలో పడటంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చెట్టు కొమ్మను తప్పించబోయిన డ్రైవ‌ర్.. బస్సుపై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతిచెందారు. 30 మంది గాయపడ్డారు. 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News