ఏడుకొండల్లో నామాల తొండ

ఈ తొండ చూడటానికి నల్లటి శరీరంతో.. వెన్నుపూసపై తెల్లని నామంతో, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టుగా కనిపిస్తోంది.

Update: 2023-06-30 13:30 GMT

namala tonda

ఏడుకొండలపై కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. నిత్యం శ్రీవారి నామ స్మరణతో మారుమ్రోగే ఏడుకొండల్లో.. అరుదైన తొండ కనిపించింది. అదే నామాల తొండ. అటవీశాఖ అధికారులకు ఈ తొండ దర్శనమిచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ అరుదైన తొండను గుర్తించినట్టు అటవీ శాఖ సిబ్బంది వెల్లడించారు. ఫారెస్ట్ లిజార్డ్ గా పిలిచే ఈ నామాల తొండ అలిపిరి సమీపంలో ఓ బండపై కనిపించింది.

ఈ తొండ చూడటానికి నల్లటి శరీరంతో.. వెన్నుపూసపై తెల్లని నామంతో, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టుగా కనిపిస్తోంది. అలాగని దానికెవరైనా నామం పెట్టారనుకుంటే పొరపాటే. తొండల్లో ఈ నామాల తొండ ఒక రకం. ఈ అరుదైన నామాల తొండ.. దక్షిణ భారత దేశంలోని రతి కొండలు ఉన్న అడవుల్లో ఎక్కువుగా కనిపిస్తుందట. సరీసృపాల జాతికి చెందిన ఈ తొండలు దక్షిణాసియా, దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో అధికంగా దర్శనమిస్తాయి. ఏడుకొండల్లో నామాల తొండ కనిపించిందన్న విషయం తెలియగానే.. భక్తులు దానిని ఆ దేవుడే పంపినట్లుగా భావించారు. ప్రస్తుతం ఈ నామాల తొండ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News