అట్టహాసంగా నేడు రఘురామ కృష్ణరాజు నామినేషన్

టీడీపీ అభ్యర్థిగా నేడు రఘురామకృష్ణరాజు నామినేషన్ వేయనున్నారు

Update: 2024-04-22 03:15 GMT

టీడీపీ అభ్యర్థిగా నేడు రఘురామకృష్ణరాజు నామినేషన్ వేయనున్నారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో భారీ ర్యాలీగా వెళ్లనును్నారు. ఈరోజు ఉదయం 10.30కు రఘురామ కృష్ణరాజు నామినేషన్ వేయనున్నారు. ఉండి టిక్కెట్ ను ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కలుపుకుని వెళతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐదు స్థానాలను మార్చి...
తెలుగుదేశం పార్టీ ఐదు నాల్లో టీడీపీ అభ్యర్థుల మార్చిన సంగతి తెలిసిందే. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించింది. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించింది. మడకశిర టికెట్ ఎం.ఎస్ రాజుకు ఇచ్చింది. మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించింది. వెంకటగిరి టిక్కెట్ కె.రామకృష్ణకు కేటాయించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News