నేడు జోడో యాత్ర సన్నాహక సమావేశం

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం నేడు కర్నూలులో జరగనుంది

Update: 2022-10-04 03:42 GMT

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం నేడు కర్నూలులో జరగనుంది. ఈ నెల 17వ తేదీన రాహుల్ యాత్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించనుంది. ఏపీలో జోడోయాత్రను సక్సెస్ చేసేందుకు నేడు కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, ఉమేష్ చాందీ, కొప్పుల రాజులు ఇప్పటికే కర్నూలుకు చేరుకున్నారు.

ఐదు రోజుల పాటు...
ఈ నెల 17 నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. ఈ ఐదురోజుల పాటు ఎక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్లాలి? రూట్ మ్యాప్ ఏంటి? ఏ నియోజకవర్గాల నుంచి వెళ్లాలన్న దానిపై ఈరోజు నిర్ణయించనున్నారు. పోలీసుల అనుమతిని కూడా కోరనున్నారు. సమావేశంలో ఎవరెవరు ఏ కార్యక్రమాలు ఈ సందర్భంగా చేపట్టాల్సిందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


Tags:    

Similar News