ఆ కార్యక్రమానికి నేను వెళ్లి ఉంటే : రఘురామకృష్ణరాజు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం అయింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం అయింది. అయితే ఈ సమావేశం అనంతరం రఘురామకృష్ణరాజు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందన్నారు. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదని, కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్పై కూర్చోబెట్టారని, మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని రఘురామకృష్ణరాజు అన్నారు.
ఎమ్మెల్యేలకు అవమానం...
ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను కూడా ఆహ్వానించాలని రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని, ఇది మొదటి తప్పుగా భావిస్తున్నానని, కార్యక్రమానికి తాను వెళ్లి ఉంటే సీటింగ్ విధానం చూసి బయటికి వచ్చేసేవాణ్ణని కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.అవమానం జరిగిందని చాలామంది ఎమ్మెల్యేలు తనతో చెప్పినందునే మాట్లాడుతున్నానని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.