స్టీఫెన్ రవీంద్రపై రఘురామ ఫిర్యాదు

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రపై ఫిర్యాదు చేశారు

Update: 2022-07-05 12:55 GMT

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. తన ఇంటిపై రెక్కీ చేసిన ఆగంతకుడిని తన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని తెలంగాణ పోలీసులకు అప్పగించరన్నారు. తనను హత్య చేసేందుకే రెక్కీ చేశారన్న అనుమానం తనకుందని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.

తన సెక్యూరిటీపైనే....
ఆగంతకుడిని విచారించాల్సిన గచ్చిబౌలి పోలీసులు తన సెక్యూరిటీ సిబ్బందిపైనే కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆయన తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని వెనక సీనియర్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఉన్నారని, ఆయన ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వ్యక్తిని విచారించి వాస్తవాలను కనుగొనాలని రఘురామ కృష్ణరాజు కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News