యువతను ఆదుకుంటాననడం బిగ్‌ జోక్‌

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై మంత్రి ఆర్కే రోజా ఘాటు విమర్శలు చేశారు. రైతులను చంద్రబాబు ఎలా

Update: 2023-05-31 09:45 GMT

యువతను ఆదుకుంటాననడం బిగ్‌ జోక్‌

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై మంత్రి ఆర్కే రోజా ఘాటు విమర్శలు చేశారు. రైతులను చంద్రబాబు ఎలా మోసగించారో అందరికీ తెలుసునన్నారు. యువతను చంద్రబాబు ఆదుకుంటా అని చెబుతున్నాడని, ఇది పెద్ద జోక్‌ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పాలనా కాలంలో చేసిన మోసాన్ని రాష్ట్ర యువతి ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహ్‌ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని, మరీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు.

చంద్రబాబు పెద్ద మోసగాడని, ఆయన లాంటి మోసగాడు దేశంలో మరెక్కడా లేడన్నారు. సీఎం జగన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థతో సంక్షేమ పథకాలు నేరుగా అర్హుల ఇంటి కే చేరుతున్నాయని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మ ఒడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారని చంద్రబాబుపై రోజా ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదని మంత్రి రోజా ప్రశ్నించారు.

బాబు వస్తే జాబ్‌ అంటూ గతంలో మోసం చేశారని, ఇప్పుడు యువతను బాబు ఆదుకుంటానని అంటున్నారని, ఇది కూడా మోసం చేయడమేనన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సీఎం జగన్‌ అండగా ఉంటున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 3,300 చికిత్సలు అందిస్తున్నది సీఎం జగన్‌ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. మేనిఫోస్టో అంటే చంద్రబాబుకు వేస్ట్‌ పేపర్‌తో సమానమన్నారు. ప్రజలను మళ్లీ బురిడీ కొట్టించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేయగలిగెవే చెప్పి.. చేతలతో చూపిస్తే, చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని మంత్రి రోజా మండిపడ్డారు.

Tags:    

Similar News