మంత్రి రోజా ఫిషింగ్ సరదా.. వలలో పడ్డ చేపలు

ఏపీ మంత్రి రోజా చేపలు అమ్మారు. తన నియోజకర్గంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర ఔట్‌లెట్‌ను ప్రారంభించి సందడి చేశారు.

Update: 2022-05-05 13:42 GMT

ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిల్కర్ స్క్రీన్ టు పొలిటికల్ స్క్రీన్.. ఆమె ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. మంత్రి అయిన తర్వాత మరింత బిజీగా మారిన రోజా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తన నియోజకవర్గ కార్యక్రమాల్లోనూ జోరు పెంచారు. ఫిట్ ఆంధ్ర ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్‌లో భాగంగా ఈరోజు వడమాలపేటలో ఏర్పాటు చేసిన ఫిష్ స్టాల్‌ని మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం అక్కడ కొద్దిసేపు సందడి చేశారు.

మంత్రి రోజా కాసేసు సరదాగా ఫిషింగ్ చేశారు. స్టాల్లో ఏర్పాటు చేసిన పెద్ద తొట్టెలో చేపలను వలలో పడుతూ సందడి చేశారు. అక్కడున్న చేపలు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా కొద్దిసేపు చేపలు విక్రయించారు. ఆమె మాట్లాడుతూ భారత్ నుంచి మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 శాతం ఏపీ నుంచే జరగడం గర్వించాల్సిన విషయమన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ ఫిట్ ఆంధ్ర.. ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె అన్నారు. 

Tags:    

Similar News