అమరావతి పనులపై అప్ డేట్ ఇచ్చిన మంత్రి నారాయణ

ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు.

Update: 2025-04-29 04:37 GMT

ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు పరిశీలనచేసిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి చేరుకుంటారని చెప్పారు. ప్రధాని పర్యటనకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని, రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని, అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామన్న మంత్రి నారాయణ 365 కిమీ ట్రంక్ రోడ్లు,లే ఔట్ రోడ్లు 1500 కి,మీ మేర నిర్మించేలా ప్లాన్ ఉందని తెలిపారు.

ప్రధాని పర్యటనలో...
గతంలోనే 41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయని, 2019 కు ముందు 5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించామని చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని, మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించామన్న మంత్రి నారాయణ గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ లు క్లోజ్ చేయలేదని తెలిపారు. రివర్స్ టెండరింగ్,జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చిందని, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టిందని తెలిపారు. 43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్నారని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. అమరావతిపై పార్లమెంట్ లో చట్టం చేయాలని రైతులు అడిగారని, చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారని మంత్రి నారాయణ తెలిపారు.


Tags:    

Similar News