అవాస్తవాలపై మంత్రి కొట్టు మండిపాటు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు వినాయక చవితి వేడుకలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు

Update: 2022-08-29 08:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు వినాయక చవితి వేడుకలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చవితి వేడుకలపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీలు పనిగట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కార్కక్రమం మొదలు పెట్టిందని తెలిపారు. తప్పుడు ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని మంత్రి కొట్టు హెచ్చరించారు. దుర్మార్గపు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన కోరారు.

ఎలాంటి రుసుము లేదు...
వినాయక చవితి వేడుకలపై ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తెలిపారు. పదే పదే రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. తమ రాజకీయాల కోసం పండగలను కూడా రాజకీయాలకు వాడుకుంటుందని తెలిపారు. చవితి వేడుకల కోసం ప్రభుత్వం మండపాల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.


Tags:    

Similar News