విషాదం.. సెల్ఫీ తీస్తుండగా నదిలోపడిన యువతి.. కాపాడబోయి ప్రియుడు కూడా..

చిత్రావతి నది వద్దకు విహార యాత్రకు వచ్చిన ప్రేమజంట ప్రమాదవశాత్తు.. అయ్యవారిపల్లి గంగమ్మ గుడివద్ద ఉన్న కాలువలో

Update: 2022-01-15 06:38 GMT

పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో పడి యువతి నదిలోపడిపోగా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రియుడు కూడా నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిమరి మండలంలో జరిగింది. చిత్రావతి నది వద్దకు విహార యాత్రకు వచ్చిన ప్రేమజంట ప్రమాదవశాత్తు.. అయ్యవారిపల్లి గంగమ్మ గుడివద్ద ఉన్న కాలువలో పడి గల్లంతైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. గల్లంతైన జంటకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : పాకిస్థాన్ లో భూకంపం.. వణికిపోయిన ప్రజలు

అమర్నాథ్, రామాంజనమ్మ అనే ప్రేమికులు సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి కాలువలో పడిపోయింది. మృతులు బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల అమర్‌నాథ్, అనంతపురం ప్రకాష్‌నగర్‌కు చెందిన రామాంజనమ్మగా గుర్తించారు. సంక్రాంతి పండగకు దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన జంట కోసం గ్రామంలోని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ వేళ.. ఇద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News