TDP : విశాఖ వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు

తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది.

Update: 2024-04-18 07:25 GMT

తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి అక్కరమాని విజయనిర్మల ఆ పార్టీని వీడారు. ఈరోజు ఉండవల్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

గతంలో వైసీపీలో...
అక్కరమాని విజయనిర్మల గతంలో విశాఖ వీఎంఆర్డీఏ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. దీంతో అసంతృప్తికి గురైన అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకట్రావు టీడీపీలో చేరారు. వీరితో పాటు మాజీ ఎంపీీపీ గోపిరాజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.


Tags:    

Similar News