పొత్తులపై పవన్ కళ్యాణ్ ఇలా అనేశారేంటి

పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తెలు

Update: 2023-07-09 02:52 GMT

పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని.. వైసీపీ అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని అన్నారు. శనివారం వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకుల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశానని.. మన పోరాటం వృథా కాదని అన్నారు పవన్ కళ్యాణ్ . రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని అన్నారు. యాత్ర తొలి విడతను విజయవంతం చేయడంలో భాగమైన కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు.

రెండో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. రెండో విడత వారాహి యాత్ర ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన ముఖ్య నేతలతో సమీక్షను నిర్వహించారు. నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను పవన్‌ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నేడు జరగనున్న యాత్ర వివరాలు, ఏలూరు సభ ఏర్పాట్ల గురించి పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజోలు, మల్కిపురం, నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో జరిపిన మొదటి విడత వారాహి యాత్రకు భారీ స్పందన లభించింది. వారాహి విజయ యాత్ర సెకండ్ ఫేజ్ ను కూడా సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది.


Tags:    

Similar News