నేడు కూడా రాజమండ్రిలో పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2023-05-11 03:39 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న కోనసీమలో పర్యటించిన పవన్ కల్యాణ్ రైతులను పరామర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ పాల్గొని వారి సమస్యలపై చర్చించారు.

అభిమానుల...
నేడు కూడా పవన్ కల్యాణ్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఆయన ఈరోజు కూడా పర్యటిస్తారని చెబుతున్నారు. నిన్న పవన్ కల్యాణ్ పర్యటన ప్రశాంతంగా జరిగింది. అభిమానులు పెద్దయెత్తున తరలివచ్చినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడంతో పర్యటన విజయవంతంగా ముగిసింది.


Tags:    

Similar News