కీలక నిర్ణయం తీసుకున్న ఇండిగో.. ఇకపై కడప నుంచి..

కడప నుంచి నేరుగా విజయవాడ, చెన్నై సిటీలకు విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థ సుముఖత తెలిపింది. ఈ మేరకు.. ఏపీ ఎయిర్‌పోర్ట్స్

Update: 2022-02-01 10:34 GMT

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి నేరుగా విజయవాడ, చెన్నై సిటీలకు విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థ సుముఖత తెలిపింది. ఈ మేరకు.. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకూ ఈ మార్గాల్లో విమాన సర్వీసులు నడిపిన ట్రూ జెట్ సంస్థ.. ఇకపై తాము విమానాలను నడపలేమంటూ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో.. అధికారులు ఇండిగోకు అవకాశమిచ్చారు.

తాజాగా ఇండిగో ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేసుకున్న ఈ ఒప్పందంతో.. వయబిలిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 27వ తేదీ నుంచి ఇండిగో సంస్థ.. చెన్నై-కడప, విజయవాడ-కడపకు వారానికి నాలుగు విమాన సర్వీసులను నడపనుంది.


Tags:    

Similar News