వైసీపీ ఎమ్మెల్యే కు ఐటీ సెగ

వైసీపీ ఎమ్మెల్యే ముస్తాపా కుటుంబ సభ్యుల ఇళ్లలో అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2023-02-28 09:10 GMT

వైసీపీ ఎమ్మెల్యే ముస్తాపా కుటుంబ సభ్యుల ఇళ్లలో అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తాఫాతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. తెనాలి పర్యటనకు జగన్ రావడంతో ముస్తాఫా ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సమయంలోనే ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం జిల్లా పార్టీలో కలకలం రేపుతుంది.

టంగుటూరు పొగాకు...
వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా సోదరుడు సోదరుడు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముస్తాఫా సోదరుడు అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాపార లావాదేవీలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. అధికార పార్టీనేత ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో పార్టీ నేతలు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో పలు పొగాకు కంపెనీల యాజమానుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News