వైసీపీ నేతల ఇంట్లో ఐటీ సోదాలు

విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేతల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నాయి

Update: 2022-12-06 04:52 GMT

విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నాయి. దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఒక భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

వల్లభనేని వంశీ ఇంట్లో....
వంశీరామ్ బిల్డర్స్ కు సంబంధించి కొన్ని పెట్టుబడులు దేవినేని అవినాష్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిసింది.  ఈ అంశం సంచలనంగా మారింది. దాదాపుగా 20 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో జరుపుతున్న దాడుల్లో లభించిన డాక్యుమెంట్లకు సంబంధించిన అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసింది. 


Tags:    

Similar News