Andhra Pradesh : ఏపీలో నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2025-05-03 01:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 3వ తేదీన తెలుగు, 4వ తేదీన ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. ఇదుకోసం ఏపీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పరీక్ష కేంద్రంలోకి సకాలంలో వస్తేనే అనుమతించనున్నారు. మొత్తం 89 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తుంది.

పదిహేను నిమిషాల గ్రేస్ పీరియడ్...
ఉదయం 8:30 గంటల నుంచి 9.45 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రం లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని అధికారులు కోరారు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో రెండు , విజయవాడలో ఆరు, తిరు పతిలో మూడు, అనంతపురంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. కేవలం బాల్ పెన్ మాత్రమే తీసుకురావాలి. కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు చేరుకోవడానికి అదనంగా సమయం ఇచ్చారు.


Tags:    

Similar News