కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే?

శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఏటా అప్పుులు పెరుగుతున్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

Update: 2022-09-21 08:55 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఏటా అప్పుులు పెరుగుతున్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2020 -2021 సంవత్సరానికి జీఎస్‌డీపీ వృద్ధి రేటు తక్కువగా ఉందని కాగ్ పేర్కొంది. కేటాయింపులకు మించి ఖర్చు చేశారని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఎఫ్ఆర్‌బీఎం చట్టంలోని...
అంతేకాకుండా ఎఫ్ఆర్‌బీఎం చట్టంలోని పరిధికి మించి అప్పులు చేశారని కూడా కాగ్ నివేదికలో వెల్లడించారు. పరిమితికి మించి అప్పులు చేశారని తెలిపింది. రెవెన్యూ ఖర్చును క్యాపిటల్ వ్యయంగా చూపించారని తెలిపింది. ఈ కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.


Tags:    

Similar News