కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2022-04-03 01:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని చెప్పింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ఏరప్ాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

జిల్లాలకు విడివిడిగా....
ప్రతి జిల్లాకు సంబంధించి విడివిడిగా నోటిఫికేషన్ లు ఇచ్చారు. ఆ జిల్లాల్లో ఏ యే మండలాలు, రెవెనయూ డివిజన్లు, జిల్లా కేంద్రం, దాని పేరు పేర్కొంటూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా రేపు ఉదయం జగన్ అన్ని కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు ఈ కార్యక్రమం ముగిసేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News