రాజధాని అమరావతే.... మేం కట్టుబడి ఉన్నాం

అమరావతిలో రాజధాని నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి పురంద్రేశ్వరి అన్నారు

Update: 2022-03-03 08:42 GMT

అమరావతిలో రాజధాని నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి పురంద్రేశ్వరి అన్నారు. హైకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించిన విషయాన్ని పురంద్రేశ్వరి గుర్తు చేశారు.

రైతులకు న్యాయం చేయాలి....
హైకోర్టు చెప్పిన విధంగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని పురంద్రేశ్వరి అన్నారు. రాజధాని భూములను తాకట్టు పెట్టకుండా దానిని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని కోరారు. కోర్టు కూడా తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకించిన విషయాన్ని పురంద్రేశ్వరి గుర్తు చేశారు. రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె కోరారు.


Tags:    

Similar News