కుదరదు అంతే

రోడ్లపై సమావేశాలు వద్దనడం నియంతృత్వ ధోరణి మాత్రమేనని మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు

Update: 2023-01-03 07:00 GMT

రోడ్లపై సమావేశాలు వద్దనడం నియంతృత్వ ధోరణి మాత్రమేనని మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కుదరదని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు జీవోలు ఇస్తే ఇక్కడ ఎవరూ పాటించరన్నారు.

తేల్చుకుంటాం....
ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందులో భాగంగానే ఈ చీకటి జీవోను విడుదల చేశారని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తాము పాటించే ప్రసక్తి లేదని తెలిపారు. ఏం జరుగుతుందో తేల్చుకుంటామని ఆయన సవాల్ విసిరారు.


Tags:    

Similar News