Tirumala : నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ పెద్దగా లేదు.

Update: 2024-01-04 02:56 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ పెద్దగా లేదు. సెలవులు అన్ని పూర్తి కావడంతో భక్తుల రాక కూడా కొంత తగ్గిందని, వీకెండ్ కాకపోవడంతో భక్తులు స్వల్ప సంఖ్యలోనే వచ్చే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరిగి వీకెండ్ లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

ఎనిమిది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 65,514 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,394 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News