Tirumala : రద్దీ కొంచెం తగ్గింది.. రీజన్ ఇదే

తిరుమలలో నేడు భక్తుల రద్దీ నేడు కొంత తగ్గింది. భక్తుల సంఖ్య తక్కువగా ఉంది

Update: 2023-11-21 03:13 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ నేడు కొంత తగ్గింది. భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. వీకెండ్ ముగియడంతో భక్తులు స్వల్పంగానే తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం పెద్దగా వేచి ఉండకుండానే లభిస్తుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

12 గంటల సమయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,198 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 22,452 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లోకి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News