Tirumala : నేడు తిరుమలలో క్యూ లైన్ ఎంత ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-04-13 02:26 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని భావించి ఎక్కువ మంది శని వారం స్వామి వారిని దర్శించుకుంటారు. అందుకే శని, ఆదివారాల్లో తిరుమలలో అత్యధికంగా భక్తులు ఉంటారు. రద్దీ విపరీతంగా ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

18 గంటల పాటు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,163 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,287 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News