మే 1న ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వండి

వచ్చేనెల మొదటి తేదీన ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు

Update: 2024-04-26 08:07 GMT

వచ్చేనెల మొదటి తేదీన ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, వికలాంగులు సచివాలయాలకు రాలేదరన్నారాయన. అందుకే గతంలో మాదిరిగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటి నుంచి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.

వడగాలుల తీవ్రత...
వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పింఛన్ల కోసం గ్రామ సచివాలయాల వద్దకు రావాలని చెప్పవద్దంటూ ఆయనకోరారు. సిబ్బంది కొరత అనే సాకులు చెప్పకుండా సచివాలయం, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేకపోతే ఎండల దెబ్బకు అనేక మంది మరణించే అవకాశాలున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News