రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదు: సీఎం జగన్

Update: 2022-11-12 05:43 GMT

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశ ప్రగతి రథసారథి, గౌరవనీయులు, పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి విశాఖకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చారిత్రక ఆంధ్ర యూనివర్శిటీలో ఈరోజు ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలో రూ. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. సార్, ఈ మూడేళ్లలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో చేశాం. మహిళలకు సాధికారత, విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనదన్నారు ముఖ్యమంత్రి జగన్. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఏపీ ప్రభుత్వం తరపున స్వాగతం చెప్పిన సీఎం జగన్… రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినందుకుగాను ప్రధాని మోదీకి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు.


Tags:    

Similar News