20న జగన్ పోర్టు కు భూమిపూజ

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

Update: 2022-07-15 05:24 GMT

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మణిహారం కాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు.

వెన్నుపోటు చంద్రంలా...
అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. "వెన్నుపోటు" చంద్రంలా మభ్య పెట్టే ప్రకటనలు, చిత్తశుద్ధిలేని శంకుస్థాపనలు ఈ ప్రభుత్వంలో ఉండవని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.


Tags:    

Similar News