20న దుర్గగుడికి జగన్

ఈ నెల 20న విజయవాడలోని ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు

Update: 2023-10-18 12:10 GMT

ఈ నెల 20న విజయవాడలోని ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతిరోజూ ఒక అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

మూలా నక్షత్రం కావడంతో...
ఈ నెల 20వ తేదీన మూలా నక్షత్రం కావడంతో అత్యధిక మంది భక్తులు వచ్చే అవకాశముంది. దాదాపు లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆరోజు అదనంగా కౌంటర్లు, తాగునీరు, ప్రసాదాలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జగన్ రాక సందర్భంగా బందోబస్తు కూడా పెంచనున్నారు.


Tags:    

Similar News