రాజ్‌భవన్ లో జగన్, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత జగన్ హాజరయ్యారు

Update: 2022-08-15 13:32 GMT

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత జగన్ హాజరయ్యారు. ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇద్దరూ విడివిడిగానే...
ఇటు ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. రాజ్ భవన్ చేరకున్న ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబు, జగన్ ఇద్దరూ విడివిడిగానే కూర్చున్నారు. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇది అక్కడ చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News