గౌతమ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జగన్

మేకపాటి గౌతమ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు.

Update: 2022-03-28 07:46 GMT

మేకపాటి గౌతమ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని జగన్ చెప్పారు. గౌతమ్ రెడ్డి చివరి నిమిషం వరకూ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడ్డారన్నారు. మరణించే ముందు కూడా ఆయన దుబాయ్ కు వెళ్లి ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. నెల్లూరులో జరిగిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు.

సంగం ప్రాజెక్టుకు.....
గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని జగన్ అన్నారు. సంగం బ్యారేజీ పనులు మే 15వ తేదీలోగా పూర్తవుతాయని, ఆ ప్రాజెక్టుకు మేకూపాటి గౌతమ్ సంగం బ్యారేజీ పేరును పెడతామని చెప్పారు. 2010 నుంచి తనకు మేకపాటి గౌతమ్ రెడ్డి తోడుగా ఉన్నారని జగన్ గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని, ఆ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు.


Tags:    

Similar News