Chandrababu : డిసెంబరు 1న చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటన
చంద్రబాబు నాయుడు డిసెంబరు 1వ తేదీన ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు
చంద్రబాబు నాయుడు డిసెంబరు 1వ తేదీన ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద లబ్దిదారులకు పింఛను పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. నవంబర్ నెలలో 63,25,999 మంది లబ్దిదారులకు రూ 2738.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంయి విడుదల చేశామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పింఛన్ల పంపిణీ...
ఈ నెలలో నూతనంగా 8190 పెన్షన్ లు అదనంగా మంజూరు చేశామని అన్నారు. ఇందుకోసం అదనంగా రూ. 3. 28 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 2, 1280 కోట్లు పెన్షన్ల క్రింద లబ్ధిదారులకు అందజేయటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటి వద్దనే పింఛను పంపిణి చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.