వైఎస్ భాస్కర్‌రెడ్డికి మరోసారి నోటీసులు

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు

Update: 2023-03-01 08:05 GMT

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ నెల 12న...
తొలుత భాస్కర్ రెడ్డికి గత నెల 23వ తేదీన విచారణకు రావాలని కోరినా, ముందస్తు కార్యక్రమాలతో తాను రాలేనని ఆయన తెలిపారు. దీంతో మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. వివేకా హత్య కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలపైనే ఎక్కువగా భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించే అవకాశముంది.


Tags:    

Similar News