భవనం కూలి ఇద్దరు మృతి.. శిధిలాల కింద

భారీ వర్షాలకు భవనాలు కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఒక భవనం కూలిపోయింది.

Update: 2021-11-20 01:38 GMT

భారీ వర్షాలకు భవనాలు కూలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఒక భవనం కూలిపోయింది. శిధిలాల కింద పది మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ భవనం కూలి పక్కనే ఉన్న రెండతస్థుల భవనంపై పడింది. ఇందులో పది మంది అద్దెకు ఉంటున్నారు. దీంతో ప్రమాదంలో పలువురు గాయపడి ఉంటారని భావిస్తున్నారు.

ఇద్దరు చిన్నారులు....
భారీ వర్షాలకు నాని ఈ భవనం కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. శిధిలాల కింద నుంచి నలుగురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News